Chief Minister: అసెంబ్లీ సమావేశాల సమయంలోనూ జనతాదర్శన్‌ను మరవని సీఎం

ABN , First Publish Date - 2022-09-14T17:07:06+05:30 IST

అసెంబ్లీ సమావేశాలతో క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) గత

Chief Minister: అసెంబ్లీ సమావేశాల సమయంలోనూ జనతాదర్శన్‌ను మరవని సీఎం

బెంగళూరు, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ సమావేశాలతో క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) గత రెండు రోజులుగా జనతాదర్శన్‌ కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. బెంగళూరు ఆర్‌టీ నగర్‌(Bangalore RT Nagar)లోని తన నివాసంలో మంగళవారం ఆయన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల మొర ఆలకించారు. వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. వీటిపై తక్షణం స్పందించాలని, తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సీఎంను కలుసుకుని తమ కష్టాలు చెప్పుకునేందుకు ఆర్‌టీ నగర్‌లోని ఆయన నివాసం ముందు వేకువ జాము నుంచే ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. అధికారులు తమ పరిధిలోని చిన్న చిన్న సమస్యలను పరిష్కరించి పంపేస్తున్నారు. సీరియ్‌సగా ఉన్న సమస్యల ప్రాధాన్యత ఆధారంగా సీఎంతో బాధితులు నేరుగా కలిసే ఏర్పాట్లు  చేస్తున్నారు.

Updated Date - 2022-09-14T17:07:06+05:30 IST