కేఆర్‌ఎస్‌, కబిని రిజర్వాయర్లకు సీఎం వాయనం

ABN , First Publish Date - 2021-11-03T16:56:05+05:30 IST

భారీ వర్షాలతో జలకళను సంతరించుకున్న కృష్ణరాజసాగర్‌, కబిని రిజర్వాయర్లకు ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మంగళవారం సంప్రదాయమైన వాయనం సమర్పించారు. అనంతరం ఆయన

కేఆర్‌ఎస్‌, కబిని రిజర్వాయర్లకు సీఎం వాయనం

బెంగళూరు(Karnataka): భారీ వర్షాలతో జలకళను సంతరించుకున్న కృష్ణరాజసాగర్‌, కబిని రిజర్వాయర్లకు ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మంగళవారం సంప్రదాయమైన వాయనం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వర్షాలతో వ్యవసాయ కార్యకలాపాలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయని ఈసారి పంటల దిగుబడి ఆశాదాయకంగా ఉంటుందని ఆకాంక్షిస్తున్నానన్నారు. తొలుత మైసూరు జిల్లాలోని హెచ్‌డీకోట తాలూకా బీచనహళ్ళి గ్రామం వద్ద కబిని రిజర్వాయర్‌కు వాయనం సమర్పించిన సీఎం అనంతరం మండ్య జిల్లా శ్రీరంగపట్టణ తాలూకాలోని కృష్ణరాజసాగర్‌ డ్యామ్‌కు వాయనం సమర్పించారు. సంప్రదాయమైన పూజలతో వాయనం సమర్పించారు. సీఎంతోపాటు జలవనరులశాఖ మంత్రి గోవింద కారజోళ, సహకారశాఖ మంత్రి ఎస్‌టీ సోమశేఖర్‌ హాజరయ్యారు. రెండు రిజర్వాయర్‌లకు వాయనం సమర్పించే అవకాశం లభించడం సంతోషంగా ఉందని సీఎం పేర్కొన్నారు.

Updated Date - 2021-11-03T16:56:05+05:30 IST