బొమ్మైతో అసోం సీఎం హిమంత భేటీ
ABN , First Publish Date - 2022-05-18T16:46:54+05:30 IST
రాజధానిలో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన అసోం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వశర్మ మంగళవారం సీఎం అధికార నివాసం కృష్ణలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను భేటీ
బెంగళూరు: రాజధానిలో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన అసోం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వశర్మ మంగళవారం సీఎం అధికార నివాసం కృష్ణలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను భేటీ అయ్యారు. ఉభయనేతలు పలు అంశాలపై చర్చలు జరిపారు. మర్యాద పూర్వకంగానే బొమ్మైను కలిశానని అనంతరం డాక్టర్ హిమంత మీడియాకు చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న పలు సంక్షేమ కార్యక్రమాల గురించి బొమ్మై తనకు వివరించారన్నారు.
సీఎం దావోస్ పర్యటనపై సందిగ్ధం
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఏ క్షణంలోనైనా జరిగే అవకాశం ఉండడంతో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై దావోస్ పర్యటన అనుమానేనని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ముఖ్యమంత్రి ఈనెల 21న దావోస్ పర్యటించాల్సి ఉంది. దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు సీఎంకు ఆహ్వానం అందింది. మంత్రివర్గ విస్తరణ, రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగాల్సి ఉండడంతో అధిష్టానం ఇందుకు అనుమతి ఇవ్వలేదని బీజేపీ వర్గాల ద్వారా తెలిసింది. చివరి క్షణంలో అధిష్టానం గ్రీన్సిగ్నల్ ఇస్తే సీఎంతోపాటు మంత్రులు మురుగేశ్ నిరాణి, డాక్టర్ సీఎన్ అశ్వత్థనారాయణ దావోస్ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. ఈనెల 26 వరకు పర్యటించాల్సిన ఈ బృందం అదే రోజు నగరానికి తిరిగి రానుంది. మొత్తానికి సీఎం దావోస్ పర్యటనపై ఇంకా స్పష్టత కనిపించడం లేదు.