Cmతో కేంద్ర మంత్రి భేటీ

ABN , First Publish Date - 2022-07-02T16:01:44+05:30 IST

కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ శుక్రవారం నగరంలో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైను కలిశారు. ఈ సందర్భంగా మేకె దాటు

Cmతో కేంద్ర మంత్రి భేటీ

బెంగళూరు, జూలై 1 (ఆంధ్రజ్యోతి): కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ శుక్రవారం నగరంలో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైను కలిశారు. ఈ సందర్భంగా మేకె దాటు ప్రాజెక్టుకు అనుమతులు, అప్పర్‌ భద్రా ప్రాజెక్టుకు జాతీయ హోదా తదితర అంశాలపైనే ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మర్యాదపూర్వకంగానే సీఎంను కలిసినట్లు కేంద్రమంత్రి షెకావత్‌ మీడియాకు చెప్పారు. బెంగళూరు పర్యటన అనంతరం ఆయన హైదరాబాద్‌లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వెళతానని తెలిపారు.

Updated Date - 2022-07-02T16:01:44+05:30 IST