చంకూర్ సాహిబ్ నుంచి చన్నీ, అమృత్సర్ ఈస్ట్కు సిద్ధూ
ABN , First Publish Date - 2022-01-15T20:43:33+05:30 IST
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 86 మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ..
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 86 మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ శనివారంనాడు విడుదల చేసింది. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అమృత్సర్ ఈస్ట్ నుంచి పోటీ చేయనుండగా, చంకౌర్ సాహిబ్ నుంచి ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ పోటీకి దిగుతున్నారు. డేరా బాబా నానక్ నియోజవర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి సుఖ్జిందర్ సింగ్ రంథావా, గిడ్డెర్బహ నుంచి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాజా అమరీందర్ పోటీ చేయనున్నారు. కాగా, నటుడు సోనూసూద్ సోదరి మాళవిక సూద్కు మోగా నియోజకవర్గం టెక్కెట్ ఇచ్చారు. ఫిబ్రవరి 14న ఒకే విడతలో పంజాబ్ ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 10న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.