సీఎం దిష్టిబొమ్మ దహనం

ABN , First Publish Date - 2020-08-06T06:29:31+05:30 IST

పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌కు వైద్యకళాశాలను మంజూరు చేయిస్తే సీఎం కేసీఆర్‌ తనసొంత జిల్లా సిద్దిపేటకు తరలించుకు పోయారని నిరసన వ్యక్తం

సీఎం దిష్టిబొమ్మ దహనం

కరీంనగర్‌ అర్బన్‌, ఆగస్టు 5: పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌కు వైద్యకళాశాలను మంజూరు చేయిస్తే సీఎం కేసీఆర్‌ తనసొంత జిల్లా సిద్దిపేటకు తరలించుకు పోయారని నిరసన వ్యక్తం చేస్తూ యువజన్‌ కాంగ్రెస్‌ అసెంబ్లీ అధ్యక్షుడు అబ్దుల్‌ రహమాన్‌, నాయకులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా అబ్దుల్‌ రహమాన్‌ మాట్లాడుతూ 2014ఆగస్టు 5న సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌కు వచ్చిన సందర్భంగా కరీంనగర్‌కు వైద్యకళాశాలను, ప్రభుత్వ ఆస్పత్రిని ఏయిమ్స్‌ తరహాలో అబివృద్ధి చేస్తానని హామీ ఇచ్చి ఆరేళ్లు గడిచిందని అన్నారు. ఇచ్చిన హామీని అమలు చేయకుంటే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామన్నారు.

Updated Date - 2020-08-06T06:29:31+05:30 IST