వంశధార ట్రిబ్యూనల్ తీర్పుపై అధికారులతో సీఎం సమీక్ష

ABN , First Publish Date - 2021-06-22T20:49:04+05:30 IST

వంశధార ట్రిబ్యూనల్ తీర్పుపై సీఎంఓ అధికారులతో సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

వంశధార ట్రిబ్యూనల్ తీర్పుపై అధికారులతో సీఎం సమీక్ష

అమరావతి: వంశధార ట్రిబ్యూనల్ తీర్పుపై సీఎంఓ అధికారులతో సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వంశధార ట్రైబ్యునల్‌ తీర్పుపై  సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ, ఒడిశా... ఉభయ రాష్ట్రాలకూ ప్రయోజనకరమని అన్నారు. సుదీర్ఘకాలం తర్వాత ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లైందని ముఖ్యమంత్రి అన్నారు. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల కాగానే వెంటనే నేరడి వద్ద వంశదారపై బ్యారేజీ నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. ఈలోగా దానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సీఎం జగన్ సూచించారు. 

Updated Date - 2021-06-22T20:49:04+05:30 IST