కలెక్టర్లతో సీఎం Jagan వీడియో కన్ఫరెన్స్
ABN , First Publish Date - 2021-11-19T15:44:33+05:30 IST
సచివాలయంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైయస్సార్, అనంతపురం జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అమరావతి: సచివాలయంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైయస్సార్, అనంతపురం జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం వీడియో కాన్ఫరెన్స్లో చర్చించనున్నారు. మరోవైపు భారీ వర్షాలు కురుస్తున్న నెల్లూరు, చిత్తూరు, వైయస్సార్ జిల్లాలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించిన విషయం తెలిసిందే. సీఎం ఆదేశాల మేరకు గత రాత్రే అధికారులు ఆయా జిల్లాలకు చేరుకున్నారు. భారీ వర్షాల వల్ల సంభవిస్తున్న వరదల నేపథ్యంలో సహాయ చర్యలను అధికారులు స్వయంగా పర్యవేక్షించనున్నారు. అలాగే పరిస్థితిని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి నివేదించనున్నారు. నెల్లూరు జిల్లాకు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, చిత్తూరు జిల్లాకు మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్న, వైయస్సార్ జిల్లాకు మరో సీనియర్ అధికారి శశిభూషణ్కుమార్ను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించినట్టు వెల్లడించింది.