ఫిర్యాదు నంబర్లు అందరికీ కనిపించేలా పెట్టాలి: జగన్
ABN , First Publish Date - 2022-04-27T23:14:53+05:30 IST
ఫిర్యాదు నంబర్లు అందరికీ కనిపించేలా పెట్టాలి: జగన్
అమరావతి: వైద్యారోగ్య శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కొవిడ్ కట్టడి చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. రుయా ఆస్పత్రి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. అలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆస్పత్రుల్లో ఫిర్యాదు నంబర్లు అందరికీ కనిపించేలా పెట్టాలని జగన్ తెలిపారు. ఒకట్రెండు ఘటనలతో మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందన్నారు. పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.