కేంద్రం ఒత్తిడితో ఉచిత బియ్యం పంపిణీకి ఏపీ సర్కార్ సిద్ధం

ABN , First Publish Date - 2022-07-24T00:23:59+05:30 IST

కేంద్రం ఒత్తిడితో ఉచిత బియ్యం పంపిణీకి ఏపీ సర్కార్ సిద్ధమైంది. వచ్చేనెల 1 నుంచి ఉదయం పూట కిలో రూపాయికి ఇంటింటికి రేషన్‌ మధ్యాహ్నం నుంచి రేషన్‌ షాపుల ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉచిత బియ్యం పంపిణీ చేయనుంది.

కేంద్రం ఒత్తిడితో ఉచిత బియ్యం పంపిణీకి ఏపీ సర్కార్ సిద్ధం

అమరావతి: కేంద్రం ఒత్తిడితో ఉచిత బియ్యం పంపిణీకి ఏపీ సర్కార్ సిద్ధమైంది. వచ్చేనెల 1 నుంచి ఉదయం పూట కిలో రూపాయికి ఇంటింటికి రేషన్‌ మధ్యాహ్నం నుంచి రేషన్‌ షాపుల ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉచిత బియ్యం పంపిణీ చేయనుంది. ఉచిత బియ్యం కోటా పంపిణీలో ఏపీ ప్రభుత్వం మెలిక పెట్టింది. ఆహార భద్రత కార్డు ఉన్న 88,76,255 మందికే ఉచిత బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. వాలంటీర్ల ద్వారా వీరికి మాత్రమే స్లిప్పులు పంపిణీకి ఆదేశాలు జారీ చేశారు. ఆహార భద్రత కార్డు లేని 56,66,437 మందికి రెండో కోటా లేని బియ్యం సరఫరా చేయనుంది. రాష్ట్రంపై భారం పడకుండా పేదలకు బియ్యం ప్రభుత్వం నిలిపివేసింది. 

Updated Date - 2022-07-24T00:23:59+05:30 IST