గవర్నర్‌ బిశ్వభూషణ్‌ ఆరోగ్యంపై సీఎం జగన్‌ ఆరా

ABN , First Publish Date - 2021-11-18T00:27:40+05:30 IST

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ ఆరోగ్యంపై సీఎం జగన్‌ ఆరా తీశారు. ఏఐజీ చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డితో నేరుగా ఫోన్‌లో సీఎం మాట్లాడారు. గవర్నర్‌ ఆరోగ్య పరిస్ధితి, అందిస్తున్న వైద్యంపై వివరాలు ఆయన అడిగి తెలుసుకున్నారు.

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ ఆరోగ్యంపై సీఎం జగన్‌ ఆరా

అమరావతి: గవర్నర్‌ బిశ్వభూషణ్‌ ఆరోగ్యంపై సీఎం జగన్‌ ఆరా తీశారు. ఏఐజీ చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డితో నేరుగా ఫోన్‌లో సీఎం మాట్లాడారు. గవర్నర్‌ ఆరోగ్య పరిస్ధితి, అందిస్తున్న వైద్యంపై వివరాలు ఆయన అడిగి తెలుసుకున్నారు. గవర్నర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్‌ నాగేశ్వర రెడ్డి తెలిపారు. 


కాగా గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు కరోనా పాజిటివ్ ఉన్నట్లు వెద్యులు వెల్లడించారు. గవర్నర్ కు కరోనా పాజిటివ్ ఉన్నట్లు ఏఐజీ ఆస్పత్రి వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం గవర్నర్ హరిచందన్‌ ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యలు వెల్లడించారు. హరిచందన్‌ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుందని త్వరలో హెల్త్‌ బులెటిన్ విడుదల చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. 

Updated Date - 2021-11-18T00:27:40+05:30 IST