చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్: సీఎం జగన్
ABN , First Publish Date - 2022-02-08T20:00:57+05:30 IST
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఉద్యోగుల సమ్మె విషయంలో ఎర్ర జెండా వెనుక పచ్చజెండా ఎజెండా ఉందన్నారు. ఉద్యోగులు సమ్మె చేయాలని ఎవరూ కోరుకోరని, చంద్రబాబు సీఎం కాలేదనే బాధ ఉన్నవాళ్లే ఆందోళనలు జరగాలని కోరుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు దత్తపుత్రుడు కూడా ఆందోళనలను కోరుకుంటున్నారంటూ పవన్ కల్యాణ్పై జగన్ సెటైర్లు వేశారు.