రేపు ఢిల్లీకి సీఎం Jagan
ABN , First Publish Date - 2022-06-01T20:26:21+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు(గురువారం) ఢిల్లీలో పర్యటించనున్నారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan mohan reddy) రేపు(గురువారం) ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని.... అక్కడి నుంచి 11:30 గంటలకు సీఎం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి వన్ జనపద్కు చేరుకోనున్నారు. పెండింగ్ ప్రాజెక్టులు, పోలవరానికి నిధులు, తదితర అంశాలపై కేంద్రమంత్రులతో కలిసి ముఖ్యమంత్రి జగన్ చర్చించే అవకాశం ఉంది.