ముస్లిం సోదరులకు సీఎం జగన్‌ ‘ఈద్‌ ముబారక్‌’

ABN , First Publish Date - 2022-05-03T13:58:25+05:30 IST

ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ పండుగ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌ శుభాకాంక్షలు(ఈద్‌ ముబారక్‌) తెలిపారు.

ముస్లిం సోదరులకు సీఎం జగన్‌ ‘ఈద్‌ ముబారక్‌’

అమరావతి: ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ పండుగ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌ శుభాకాంక్షలు(ఈద్‌ ముబారక్‌) తెలిపారు. రంజాన్‌ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని అన్నారు. అల్లాహ్‌ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని సీఎం ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్‌ మాసం విశిష్టత అని పేర్కొన్నారు. పవిత్ర దివ్య ఖురాన్‌ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్‌ ఒక ముగింపు వేడుక అని అన్నారు. క్రమశిక్షణతో ఉండడం, ఐకమత్యంతో మెలగడం, పేదలకు తోడ్పడటం ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని తెలిపారు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్‌ అని సీఎం జగన్ పేర్కొన్నారు. 

Read more