AP: జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం జగన్
ABN , First Publish Date - 2021-08-15T14:53:54+05:30 IST
రాష్ట్రంలో 75వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
అమరావతి: రాష్ట్రంలో 75వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందిరాగాంధీ స్టేడియంలోని సభా ప్రాంగణంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఒపెన్ టాప్ జీపుపై స్టేడియంలో తిరుగుతూ సీఎం పరెడ్ను పరిశీలించారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎస్ ఆదిత్యనాద్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.