పరీక్షలపై సీఎం జగన్ కీలక ప్రకటన
ABN , First Publish Date - 2021-04-24T02:30:30+05:30 IST
పరీక్షలపై సీఎం జగన్ కీలక ప్రకటన
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరీక్షల నిర్వహణపై కీలక ప్రకటన చేశారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షలు యథాతధంగా జరుగుతాయని సీఎం జగన్ స్పష్టం చేశారు. విద్యాపరంగా విద్యార్థులకు నష్టం జరగొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జగన్ తెలిపారు. ఏపీలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. 18-45 ఏళ్ల మధ్య వారందరికీ ఉచితంగా కోవిడ్ వాక్సిన్ ఇస్తామని జగన్ వెల్లడించారు. వెంటనే కొవిడ్ వాక్సిన్ డోస్లకు ఆర్డర్ పెట్టాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. రైతు బజార్లు, మార్కెట్లను గతంలోలా వికేంద్రీకరించాలని జగన్ పేర్కొన్నారు.