ప్రధానికి సీఎం జగన్‌ లేఖ

ABN , First Publish Date - 2021-06-30T01:43:52+05:30 IST

ఏపీలో వాక్సినేషన్‌ జరిగిన విధానంపై ప్రధాని మోడీకి సీఎం జగన్‌ లేఖ రాశారు. ఏపీలో

ప్రధానికి సీఎం జగన్‌ లేఖ

 అమరావతి: ఏపీలో వాక్సినేషన్‌ జరిగిన విధానంపై ప్రధాని మోడీకి సీఎం జగన్‌ లేఖ రాశారు. ఏపీలో వ్యాక్సినేషన్‌ వేయడంలో సరికొత్త రికార్డును సృష్టించామని లేఖలో జగన్ పేర్కొన్నారు. కేంద్రం ఆదేశాల మేరకు ప్రైవేట్‌ ఆస్పత్రులకు 25 శాతం వ్యాక్సినేషన్‌ డోసులు కేటాయిస్తున్నామని జగన్ తెలిపారు. ఈ నెల 21 నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ప్రైవేట్‌ ఆస్పత్రులలో 2.67 లక్షల మందికి మాత్రమే వ్యాక్సినేషన్‌ జరిగిందన్నారు.  ప్రైవేట్ ఆస్పత్రులలో వ్యాక్సినేషన్‌కు ఆ స్థాయిలో డిమాండ్‌ లేదన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు వినియోగించని వ్యాక్సిన్‌ డోసులను ప్రభుత్వ మాధ్యమం ద్వారా వేయడానికి అనుమతి ఇవ్వాలని ప్రధానిని సీఎం జగన్‌ కోరారు. 

Updated Date - 2021-06-30T01:43:52+05:30 IST