APNews: సీజేఐ ఎన్వీ రమణతో సీఎం జగన్ భేటీ

ABN , First Publish Date - 2022-08-20T14:28:58+05:30 IST

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సతీసమేతంగా భేటీ అయ్యారు.

APNews: సీజేఐ ఎన్వీ రమణతో సీఎం జగన్ భేటీ

అమరావతి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (CJI NV Ramana)తో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagana mohan reddy) సతీసమేతంగా భేటీ అయ్యారు. ఈరోజు ఉదయం విజయవాడకు చేరుకున్న ఎన్వీరమణ(CJI)ను జగన్ (CM) మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు జస్టిస్ రమణతో ముఖ్యమంత్రి (Jagan) మీటింగ్ జరిగింది. సీఎం జగన్ వెళ్లిన అనంతరం సీజేఐతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) భేటీ కానున్నారు.  సీజేఐతో సుమారు 15 - 20 నిమిషాల పాటు చంద్రబాబు (TDP Chief) సమావేశం అవుతారు. ఈ క్రమంలో సీఎం జగన్(YCP Chief) - చంద్రబాబు (TDP)కాన్వాయిలు క్లాష్ కాకుండా అధికారులు షెడ్యూల్‌ను సిద్ధం చేశారు. 

Updated Date - 2022-08-20T14:28:58+05:30 IST