నా తల్లిని కూడా తిడతారా?: YS Jagan

ABN , First Publish Date - 2021-10-21T14:35:25+05:30 IST

రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో కొత్త కోణం చూస్తున్నానని సీఎం జగన్ అన్నారు.

నా తల్లిని కూడా తిడతారా?: YS Jagan

అమరావతి: రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో కొత్త కోణం చూస్తున్నానని సీఎం జగన్ అన్నారు.  పోలీసు అమరవీరుల దినం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కొత్త నేరగాళ్లు ఎలా చేస్తున్నారో మన కళ్ల ముందే కనిపిస్తోందని తెలిపారు. అధికారం దక్కలేదని చీకట్లో విగ్రహాలు ధ్వంసం, కుల, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. సంక్షేమ పధకాలను అడ్డుకునేందుకు కోర్టులలో కేసులు వేశారన్నారు. ఇళ్ల నిర్మాణం కుడా ఆపి వేయించారని... పేదలకు ఇంగ్లీషు మీడియం దక్కకుండా చేశారని ఆరోపించారు. చివరకి సీఎంనే బోష్ డికే(లం.. కొ)అనే స్థాయికి దిగజారారని విమర్శించారు. ‘‘మన వాడు సీఎం కాదని.... నా తల్లిని కూడా తిడతారా’’ అంటూ సీఎం ప్రశ్నించారు. నేడు ఇలాంటి వారిని ఎదుర్కొని ప్రజల కోసం మంచి పాలన అందిస్తున్నానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలలో, ఉప ఎన్నికలలో అధికార పార్టీకి అఖండ విజయం అందించారన్నారు. ఇక అధికారం రాదనే దుగ్ధతో  ఏపీపై విషం చిమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి సరఫరా అంటూ పదే పదే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు.


ఒక్క సీఎం మీదే కాదు.. ఏపీ ప్రజలపై చేస్తున్న దాడి అని అన్నారు. ఇది అధర్మం, అనైతికం, పచ్చి అబద్దమని  తెలిపారు. కేంద్రం దర్యాప్తు బృందాలు, విజయవాడ సీపీ, డీజీపీ ఇది అబద్ధం అని ఆదారాలతో చూపించారన్నారు. అయినా క్రిమినల్ మైండ్‌తో రాష్ట్ర యువతపై కళంకిత ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్ అనేది ప్రధాన ప్రయారిటీ అని... తన, మన బేధం వద్దన్నారు. పౌరుల రక్షణ, భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడవద్దని స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాలపై దాడి చేస్తే చట్టం ముందు నిలబెట్టాలన్నారు. సంఘ విద్రోహ శక్తులు, అసాంఘిక కార్యకలాపాల పై పోలీసులు ఉక్కు పాదం మోపాలని పిలుపునిచ్చారు. అందరి ప్రభుత్వానికి మంచి జరగాలని కోరుకుంటున్నానని సీఎం జగన్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-21T14:35:25+05:30 IST