భీమవరం వచ్చిన ప్రధానికి ధన్యవాదాలు: సీఎం Jagan
ABN , First Publish Date - 2022-07-04T17:42:35+05:30 IST
అల్లూరి సీతారామారాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు భీమవరం వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు.
పశ్చిమగోదావరి: అల్లూరి సీతారామారాజు (Alluri sitaramaraju) 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు భీమవరం వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra modi)కి సీఎం జగన్ (Jagan) ధన్యవాదాలు తెలిపారు. అల్లూరి జయంతి వేడుకల్లో భాగంగా పెద అమిరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ... అల్లూరి జయంతి వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. పోరాట యోధుల్లో మహా అగ్నికణం అల్లూరి అని అన్నారు. లక్షల మంది త్యాగాల ఫలితమే నేటి భారతమని తెలిపారు. ఆయన నడిచిన నేలకు అల్లూరి జిల్లా పేరు పెట్టామని అన్నారు. తెలుగు జాతి, దేశానికి గొప్ప స్ఫూర్తి అల్లూరి అని కొనియాడారు. అల్లూరి సీతారామరాజు విప్లవవీరుడు అని జగన్ మోహన్ రెడ్డి అన్నారు.