జగన్ను ప్రశ్నించిన నాదెండ్ల
ABN , First Publish Date - 2022-07-10T00:04:02+05:30 IST
సీఎం జగన్ (CM Jagan)ను జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) సూటిగా ప్రశ్నించారు.
అమరావతి: సీఎం జగన్ (CM Jagan)ను జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) సూటిగా ప్రశ్నించారు. వైసీపీ (YCP) మేనిఫెస్టో నిజంగానే 95 శాతం పూర్తి చేశారా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు ఇంటి బయటకు వచ్చి పాలన చేశారా అని నిలదీశారు. సంక్షేమ పథకాలకు నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. మేనిఫెస్టో 95 శాతం పూర్తి చేస్తే ఏప్రిల్లోనే ఎన్నికలు పెట్టాలన్నారు. వైసీపీ మేనిఫెస్టో, సిద్ధాంతం అంతా వ్యక్తి చుట్టే తిరుగుతోందని ఎద్దేశాచేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విఫలమైందన్నారు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారని తెలిపారు. వైసీపీ పాలనలో 3 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వైసీపీ నేతలు ఎందుకు రైతులను ఆదుకోలేకపోయారని నిలదీశారు. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లోని సొమ్ము ఏమైంది? అని ప్రశ్నించారు. కులాలు, మతాలవారీగా చీల్చి ఓట్లు పొందేందుకు యత్నిస్తున్నారని నాదెండ్ల మనోహర్ దుయ్యబట్టారు.