AP News: ఏపీ ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉందని జగన్ చెప్పారు: నారా లోకేష్

ABN , First Publish Date - 2022-09-17T22:43:55+05:30 IST

ఏపీ ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉందని సీఎం జగన్ (CM Jagan) చెప్పారని, అటువంటప్పుడు రాష్ట్రం నుంచి నేషనల్ గేమ్స్లో పాల్గొంటున్న..

AP News: ఏపీ ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉందని జగన్ చెప్పారు: నారా లోకేష్

విజయవాడ: ఏపీ ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉందని సీఎం జగన్ (CM Jagan) చెప్పారని, అటువంటప్పుడు రాష్ట్రం నుంచి నేషనల్ గేమ్స్లో పాల్గొంటున్న.. క్రీడాకారులకు ఎందుకు భరోసా ఇవ్వలేకపోయారని టీడీపీ నేత నారా లోకేష్ (TDP leader Nara Lokesh) విమర్శించారు. 300 మంది క్రీడాకారులు, కోచ్లు, మేనేజర్లకు ఇప్పటివరకు.. ఎలాంటి ఆర్థిక భరోసా ఎందుకు ఇవ్వలేకపోయారు జగన్రెడ్డి? అని లోకేష్ ప్రశ్నించారు. నేషనల్ గేమ్స్కు వెళ్తున్న క్రీడాకారులకు.. కనీసం ఒక్కరోజు శిక్షణ కూడా ఇవ్వలేదంటున్నారని తెలిపారు. గుజరాత్ వెళ్లేందుకు క్రీడాకారుల ప్రయాణానికి.. రిజర్వేషన్లు (Reservations) కూడా చేయించలేదంటున్నారని పేర్కొన్నారు. దొంగాటలు, దోపిడీ ఆటలు, మీరు ఆడుకునే పబ్జీ గేమ్స్ తప్ప.. మీ దృష్టిలో మిగతా క్రీడలకు విలువ లేదా జగన్రెడ్డి? అని ప్రశ్నించారు. క్రీడాకారులకు నిధులు మంజూరు చేసి.. వారు ఆత్మవిశ్వాసంతో పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.


Updated Date - 2022-09-17T22:43:55+05:30 IST