కరోనా వ్యాప్తిపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష

ABN , First Publish Date - 2021-04-23T21:55:53+05:30 IST

కరోనా వ్యాప్తిపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష

కరోనా వ్యాప్తిపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమీక్ష ప్రారంభమైంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై నిన్న మంత్రుల కమిటీ సమావేశమైంది. ఆ వివరాలను సీఎం జగన్‌కు మంత్రులు అందించనున్నారు. ఆక్సిజన్ సప్లై, రేమిడిసివేర్, బెడ్స్ అందుబాటు తదితర అంశాలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించనున్నారు. మరో వైపు రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజువారీగా వేలల్లోనే నమోదవుతున్నాయి. నిన్న ఏపీలో 10 వేలకు పైగానే కరోనా కేసులు నమోదయ్యాయి.



Updated Date - 2021-04-23T21:55:53+05:30 IST