హోంశాఖపై సీఎం జగన్‌ సమీక్ష

ABN , First Publish Date - 2022-04-20T22:44:27+05:30 IST

హోంశాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో డ్రగ్స్‌కు చోటు ఉండొద్దన్నారు. అవినీతి జరిగే అవకాశం ఉన్న శాఖలను క్లీన్‌ చేయాల్సిందేనని చెప్పారు.

హోంశాఖపై సీఎం జగన్‌ సమీక్ష

అమరావతి: హోంశాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో డ్రగ్స్‌కు చోటు ఉండొద్దన్నారు. అవినీతి జరిగే అవకాశం ఉన్న శాఖలను క్లీన్‌ చేయాల్సిందేనని చెప్పారు. దిశ తరహాలో అవినీతిపై ఫిర్యాదులకు ఏసీబీ యాప్‌ రూపొందించాలన్నారు. నెల రోజుల్లోగా యాప్‌ రూపకల్పన చేయాలని ఆదేశించారు. బాధితుల ఆడియోను కూడా ఫిర్యాదుగా పంపొచ్చన్నారు. మండల స్థాయి వరకూ ఏసీబీ  స్టేషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇతర విభాగాల్లో అవినీతి ఫిర్యాదులపైనా ఏసీబీ పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి డ్రగ్స్‌ను కూకటి వేళ్లతో పెకలించాలని జగన్ ఆదేశించారు.

Updated Date - 2022-04-20T22:44:27+05:30 IST