సీఎం జగన్ తిరుమల షెడ్యూల్లో మరోసారి మార్పులు
ABN , First Publish Date - 2020-09-23T17:21:09+05:30 IST
సీఎం జగన్ తిరుమల షెడ్యూల్లో మరో సారి స్వల్ప మార్పులు చోటు చేసుకుంది.
తిరుమల: సీఎం జగన్ తిరుమల షెడ్యూల్లో మరో సారి స్వల్ప మార్పులు చోటు చేసుకుంది. ఢిల్లీ పర్యటన ఆలస్యం కావడంతో సాయంత్రం 4 గంటలకు జగన్ తిరుమలకు చేరుకునే అవకాశం ఉంది. సాయంత్రం 5:30 గంటలకు ప్రధాని నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్లో అన్నమయ్య భవన్ నుంచి సీఎం పాల్గొననున్నారు. అనంతరం 6:15 గంటలకు శ్రీవారికీ పట్టు వస్త్రాలు సమర్పించేందుకు బేడీ ఆంజినేయ స్వామి ఆలయం వద్దకు సీఎం జగన్ చేరుకోనున్నారు.