నేడు సత్యసాయి జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

ABN , First Publish Date - 2022-06-14T12:47:17+05:30 IST

నేడు సత్యసాయి జిల్లాలోని చెన్నేకొత్తపల్లిలో సీఎం జగన్‌ పర్యటించనున్నారు.

నేడు సత్యసాయి జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

సత్యసాయి: నేడు సత్యసాయి జిల్లాలోని చెన్నేకొత్తపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి 10.25 కు పుట్టపర్తి ఎయిర్ పోర్ట్‌కు చేరుకోనున్నారు.ఉదయం 10.30 గంటలకు పుట్టపర్తి ఎయిర్ పోర్ట్ నుంచి చెన్నేకొత్తపల్లికి చేరుకుంటారు. 11.15 నుంచి 12.45వరకు సీఎం జగన్ రైతులతో ముఖాముఖి అవుతారు. వైఎస్సార్ ఉచిత పంటల భీమాను  విడుదల చేస్తారు. జిల్లా అభివృద్ధిపై అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఈ నెల 17న కడప జిల్లాలో జగన్‌ పర్యటించనున్నారు. పులివెందుల, ప్రొద్దుటూరులో పర్యటించి పార్టీ నేతలతో భేటీ అవుతారు. ఈ భేటీలో జిల్లాలో పార్టీ పటిష్టతపై కీలక విషయాలపై   సీఎం జగన్‌ చర్చించే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - 2022-06-14T12:47:17+05:30 IST