నేడు తిరుమల వెళ్లనున్న సీఎం జగన్
ABN , First Publish Date - 2022-09-27T12:43:06+05:30 IST
నేడు తిరుమల వెళ్లనున్న సీఎం జగన్
అమరావతి: నేడు, రేపు తిరుమల, నంద్యాలలో సీఎం జగన్ పర్యటించనున్నారు. రాత్రి 9 గంటలకు పెద్దశేషవాహన సేవలో సీఎం జగన్ పాల్గొననున్నారు. రాత్రికి తిరుమలలోని పద్మావతి వసతిగృహంలో సీఎం జగన్ బస చేయనున్నారు. రేపు ఉదయం తిరుమల శ్రీవారిని సీఎం జగన్ దర్శించుకుంటారు. అనంతరం రేణిగుంట నుంచి విజయవాడ బయలుదేరి రానున్నారు. రేపు రామ్కో సిమెంట్స్ పరిశ్రమలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు.