AP News: ఒక్క చాన్స్ అంటూ జగన్ ప్రజలను మోసం చేశారు: యనమల
ABN , First Publish Date - 2022-08-07T23:24:19+05:30 IST
ఒక్క చాన్స్ అంటూ సీఎం జగన్ (CM Jagan) ప్రజలను మోసం చేశారని మాజీమంత్రి యనమల రామకృష్ణుడు
అమరావతి: ఒక్క చాన్స్ అంటూ సీఎం జగన్ (CM Jagan) ప్రజలను మోసం చేశారని మాజీమంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala Rama Krishnudu) దుయ్యబట్టారు. జగన్రెడ్డి గడపగడపకు కార్యక్రమం బెడిసికొడుతోందని ఎద్దేవాచేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సామాన్యుల ప్రశ్నలకు జవాబు చెప్పలేని స్థితిలో ఆర్థికశాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి (Buggana Rajendranath Reddy) ఉన్నారని విమర్శించారు. జనాల్లోకి వెళ్లేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు ముఖం చాటేస్తున్నారని తెలిపారు. గడపగడపకు వైసీపీ నేతలకు నిలదీతలు, ఛీత్కారాలే ఎదువుతున్నాయని పేర్కొన్నారు. మూడేళ్లలో దోచుకోవడం, అప్పులు చేయడం తప్ప ఏం చేశారు? అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.