పలు శాఖలపై సీఎం జగన్‌ సమీక్ష

ABN , First Publish Date - 2022-07-26T02:00:10+05:30 IST

పలు శాఖలపై సీఎం జగన్‌ సమీక్ష

పలు శాఖలపై సీఎం జగన్‌ సమీక్ష

అమరావతి: పలు శాఖలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఎక్సైజ్, రెవెన్యూ, మున్సిపల్‌, భూగర్భగనులు, అటవీ పర్యావరణశాఖ అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... అక్రమ మద్యం తయారీ, రవాణాలను నిరోధించాలని సూచించాు. అక్రమ మద్యం నిరోధంలో మహిళా పోలీసులది కీలకపాత్ర ఉందన్నారు. గ్రామ సచివాలయంలో మహిళా పోలీసులకు సంబంధించి ఎస్‌ఓపీ రూపొందించాలన్నారు. అలాగే సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో అవినీతి నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఉన్న స్టాక్‌ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. పక్కాగా స్టాక్‌ వెరిఫికేషన్‌ చేయాలన్నారు. 

Updated Date - 2022-07-26T02:00:10+05:30 IST