ఉద్యోగసంఘాల ఒత్తిడితో దిగొచ్చిన జగన్ సర్కార్
ABN , First Publish Date - 2022-08-13T23:42:19+05:30 IST
ఉద్యోగసంఘాల ఒత్తిడితో దిగొచ్చిన జగన్ సర్కార్
అమరావతి: ఉద్యోగసంఘాల ఒత్తిడితో జగన్ సర్కార్ దిగొచ్చింది. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్పై ఆర్థికశాఖ ఆమోదంతో జీవో 203 విడుదల చేశారు. ఆరోగ్యశ్రీ కింద వర్తిస్తున్న 565 ప్రొసీజర్స్ అన్నింటినీ EHSకు కూడా వర్తించేవిధంగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జరీ చేసింది. EHS కార్డుపై ట్రీట్మెంట్ చేసుకున్నవారికి అయ్యే బిల్లులను 21 రోజుల్లోగా ఆటో డెబిట్ స్కీమ్ ద్వారా EHS పేమెంట్స్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అలాగే EHS కార్డుపై ఇతర రాష్ట్రాల్లోనూ వైద్యం అందించేలా ఉత్తర్వులు జారీ చేశారు.