వైసీపీ అరాచకాలను ప్రశ్నించే మీడియా రాక్షసులా?

ABN , First Publish Date - 2022-04-08T01:39:23+05:30 IST

నరసరావుపేటలో సీఎం జగన్ పర్యటించారు. ప్రధాని మోదీ తనకు క్లాస్‌ ఇచ్చారని ప్రచారం చేస్తున్నారని,..

వైసీపీ అరాచకాలను ప్రశ్నించే మీడియా రాక్షసులా?

పల్నాడు: నరసరావుపేటలో సీఎం జగన్ పర్యటించారు. ప్రధాని మోదీ తనకు క్లాస్‌ ఇచ్చారని ప్రచారం చేస్తున్నారని, తాను మోదీ మాత్రమే ఆ రూమ్‌లో ఉన్నామని, వీళ్లు రూమ్‌లో సోఫా కింద ఉండి విన్నారా? అని జగన్ వ్యాఖ్యానించారు. మారీచులు, రాక్షసులతో యుద్ధం చేస్తున్నామని, ఎల్లో మీడియా ముసుగులో ఉన్నవారంతా దొంగల ముఠానే అని సీఎం జగన్‌ అన్నారు. 


ఈ నేపథ్యంలో ‘‘వైసీపీ అరాచకాలను ప్రశ్నించే మీడియా రాక్షసులా?. రాష్ట్రాన్ని అంధకారంలో నింపేసిన మీరు దేవదూతలా?. గతంలో నీలి మీడియా ఏ మూలన పడుకుని రాసింది?. పరిపాలనలో ఫెయిలైన జగన్ సంయమనం కోల్పోతున్నారా?. అబద్ధాల లెక్క తీస్తే జగన్‌ను మించిన వారున్నారా?. మంత్రులను తప్పించినంత మాత్రాన ఫెయిల్యూర్ ముద్రపోతుందా?. ప్రజల కోసం పని చేసే పార్టీలు దొంగల ముఠానా?. వైసీపీ అరాచకాలను ప్రశ్నించే మీడియా రాక్షసులా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 



Updated Date - 2022-04-08T01:39:23+05:30 IST