తన పని అయిపోయందని జగన్కి అర్ధమైపోయిందా?
ABN , First Publish Date - 2021-10-29T01:06:36+05:30 IST
ప్రశాంత్ కిశోర్ (పీకే) టీమ్ 2022 మార్చి నుంచి ఏపీలో రంగంలోకి దిగనుంది.. 2022 మార్చి నుంచి పీకే టీమ్ విస్తృతంగా రాష్ట్రంలో..
అమరావతి/హైదరాబాద్: ప్రశాంత్ కిశోర్ (పీకే) టీమ్ 2022 మార్చి నుంచి ఏపీలో రంగంలోకి దిగనుంది.. 2022 మార్చి నుంచి పీకే టీమ్ విస్తృతంగా రాష్ట్రంలో పర్యటించనుంది. సంక్షేమ పథకాల అమలుపై ప్రజాభిప్రాయం సేకరించనుంది. ప్రధానంగా మంత్రులు, ప్రజాప్రతినిధుల పనితీరుపై వాకబు చేయనున్నారు. ఈ సర్వే 2024 ఎన్నికలకు బాగా ఉపయోగపడుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. గత ఎన్నికల్లోనూ జగన్కు పీకే టీమ్ పని చేసింది. అధికారంలోకి వచ్చేందుకు తీవ్రమైన కృషి చేసింది. అయితే 6 నెలల్లోనే మంచి అనిపించుకుంటానన్న జగన్కు మళ్లీ పీకే అవసరం రావడంపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ‘‘ఒక్కఛాన్స్ ఇస్తే నిరూపించుకుంటా అన్నారుగా?. రెండేళ్లు నిండేసరికే ప్రశాంత్ కిషోర్ శరణు కోరారెందుకు? చంద్రబాబు వయసైపోయిందని జనానికి చెప్తారట?. అంటే తన పని అయిపోయందని జగన్కి అర్ధమైపోయిందా?. అప్పుడు నారసుర రక్త చరిత్ర అని ప్రజల్ని నమ్మించాలనుకుంటున్నారుగా?. ఇప్పుడు హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకి సమాధానం చెప్పగలరా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.