ఏపీలో పెన్షన్ కానుక పెంపును ప్రారంభించిన సీఎం Jagan

ABN , First Publish Date - 2022-01-01T18:42:01+05:30 IST

రాష్ట్రంలో పెన్షన్ కానుక పెంపును ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి శనివారం ప్రారంభించారు.

ఏపీలో పెన్షన్ కానుక పెంపును ప్రారంభించిన సీఎం Jagan

గుంటూరు: రాష్ట్రంలో పెన్షన్ కానుక పెంపును ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. జిల్లాలోని ప్రత్తిపాడులో ఏర్పాటు చేసిన సభలో జగన్ పెరిగిన పెన్షన్‌ను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసి బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ  ఏపీలో నేటి నుంచి వృద్ధులకు రూ.2500 పెన్షన్‌ అందిస్తామన్నారు. మేనిఫెస్టోలోని ప్రతిమాటను అమలు చేస్తున్నామని తెలిపారు. చీకటి నుంచి వెలుగులోకి రావాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారన్నారు. 62 లక్షల కుటుంబాల్లో చిరునవ్వులు వచ్చాయని అన్నారు. దేశంలోనే అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏపీ అని సీఎం జగన్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-01T18:42:01+05:30 IST