గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై వర్క్ షాప్

ABN , First Publish Date - 2022-06-08T19:31:27+05:30 IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై వర్క్‌షాప్ నిర్వహించారు.

గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై వర్క్ షాప్

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు, రీజనల్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులకు సీఎం దిశానిర్దేశం చేశారు. గడప గడపకూ అనేది నిరంతరాయంగా జరిగే కార్యక్రమమని తెలిపారు. దాదాపు 8 నెలల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఒక్కో సచివాలయానికి రెండు రోజులపాటు కేటాయింపు ఉంటుందని,  నెలలో 20 రోజుల చొప్పున 10 సచివాలయాల్లో గడపగడపకూ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. గడప గడపకూ కార్యక్రమంపై నెలకోసారి వర్క్ షాపు నిర్వహిస్తామని జగన్ తెలిపారు. మనకు ఓటు వేయనివారికి కూడా రాజకీయాలు, పార్టీలు చూడకుండా పారదర్శకంగా మేలు చేశామన్నారు.  సంతృప్తి స్థాయిలో మంచి చేశామని చెప్పుకోగలుగుతున్నామని అన్నారు. రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు పథకాలు చేరాయన్నారు. ప్రతి సచివాలయంలో కచ్చితంగా 2 రోజులు గడపగడపకూ నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు. 

Updated Date - 2022-06-08T19:31:27+05:30 IST