విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్న సీఎం Jagan
ABN , First Publish Date - 2022-07-15T16:14:51+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కాసేపటి క్రితమే విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు.
విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan mohan reddy) కాసేపటి క్రితమే విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన ఆంధ్రాయూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా నాలుగో విడత వైయస్సార్ వాహన మిత్ర పథకం కింద ఆటో కార్మికులకు ఆర్థిక సాయాన్ని సీఎం అందించనున్నారు. కార్యక్రమం అనంతరం జగన్ తిరిగి విశాఖ ఎయిర్పోర్టు నుండి రాజమండ్రికి వెళ్లనున్నారు.