హర్ష.. నిన్ను చూసి గర్విస్తున్నా.. కుమార్తె ఎదుగుదలపై మురిసిపోతూ CM Jagan ట్వీట్
ABN , First Publish Date - 2022-07-03T03:41:47+05:30 IST
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కుమార్తె హర్ష... ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు. డిస్టింక్షన్లో...
అమరావతి/పారిస్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కుమార్తె హర్ష... ఇన్సీడ్ (INSEAD) బిజినెస్ స్కూల్ నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు. డిస్టింక్షన్లో పాస్ అవడమేకాకుండా కళాశాల డీన్స్ జాబితాలో కూడా హర్ష చోటు దక్కించుకున్నారు. పారిస్లో జరిగిన కళాశాల స్నాతకోత్సవంలో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా తన కుమార్తె ఎదుగుదలను చూసి సీఎం జగన్ మురిసిపోయారు. ట్విట్టర్ ద్వారా తన ప్రేమను వ్యక్తం చేశారు. హర్ష మాస్టర్స్ పూర్తి చేయడం తనకు చాలా గర్వంగా ఉందన్నారు. హర్షకు దేవుడి ఆశీస్సులతో పాటు అన్ని విధాలుగా తోడుగా నిలవాలని జగన్ ఆక్షాంక్షించారు. హర్ష గతంలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విషయం తెలిసిందే.