24న వరంగల్ రూరల్ జిల్లాకు సీఎం రాక
ABN , First Publish Date - 2021-07-22T06:33:15+05:30 IST
24న వరంగల్ రూరల్ జిల్లాకు సీఎం రాక
నల్లబెల్లిలో ఎమ్మెల్యే పెద్దిని పరామర్శించనున్న కేసీఆర్
నర్సంపేట, జూలై 21: వరంగల్ రూరల్ జిల్లాలోని నల్లబెల్లి మండల కేంద్రానికి ఈ నెల 24న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రానున్నారు. ఈ మేరకు వరంగల్ పోలీసు కమిషనర్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తండ్రి పెద్ది రాజిరెడ్డి ఇటీవల మృతి చెందారు. కాగా, వారి కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం కేసీఆర్.. ఎమ్మెల్యే స్వగ్రామమైన నల్లబెల్లికి శనివారం ఉదయం హెలీకాప్టర్లో రానున్నారు. పెద్ది సుదర్శన్రెడ్డి ఇంటికి వెళ్లి పెద్ది రాజిరెడ్డి చిత్రపటం వద్ద నివాళులర్పించి ఎమ్మెల్యే పెద్దిని, ఆయన కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ పరామర్శించనున్నారు. సీఎం రాక సందర్భంగా నల్లబెల్లిలో ఎమ్మెల్యే పెద్ది ఇంటి పరిసర ప్రాంతాల్లో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. హెలీప్యాడ్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేస్తున్నారు.