మతం ఉన్మాద స్థితికి వెళ్తే సమాజానికి హానికరం: సీఎం కేసీఆర్
ABN , First Publish Date - 2021-12-22T03:13:27+05:30 IST
మతం ఉన్మాద స్థితికి వెళ్తే సమాజానికి హానికరమని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో...
హైదరాబాద్: మతం ఉన్మాద స్థితికి వెళ్తే సమాజానికి హానికరమని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీస్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్ చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలోని పరిస్థితులను గమనించే క్రిస్మస్, బతుకమ్మలను అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. మతపరమైన దాడులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. వచ్చే కేబినెట్లో చర్చించి క్రిస్టియన్ల సమస్యలు పరిష్కరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.