మోదీపై జనంలో ఆగ్రహం పెరిగిపోతోంది: సీఎం కేసీఆర్
ABN , First Publish Date - 2022-07-02T20:56:57+05:30 IST
దేశంలో మోదీపై జనంలో ఆగ్రహం పెరిగిపోతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బిజెపిని ఓడిస్తారని అన్నారు.
హైదరాబాద్: దేశంలో మోదీపై జనంలో ఆగ్రహం పెరిగిపోతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బిజెపిని ఓడిస్తారని అన్నారు.సామాన్యుడు బతకలేని పరిస్థితి కల్పించారన్నారు. దేశంలో కరోనా నియంత్రణలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.బీజేపీ విధానాలతో దేశం పూర్తిగా నష్టపోతోందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటివరకూ దేశంలో 9 ప్రభుత్వాలను పడగొట్టారు.మత విద్వేషాలతో దేశాన్ని కలుషితం చేస్తున్నారని ఆరోపించారు. శనివారం జలవిహార్ లో జరిగిన యశ్వంత్ సిన్హా సభంలో సీఎం మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం కోరుకున్న భారతదేశం ఇవేనా? కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.జాతిపిత గాంధీని కూడా అవమానిస్తున్నారని కేసీఆర్ అన్నారు.