పోచంపల్లి ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక సంతోషకరం
ABN , First Publish Date - 2021-11-17T01:58:28+05:30 IST
యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచం పల్లికి ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా అంతర్జాతీయ గుర్తింపు లభించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచం పల్లికి ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా అంతర్జాతీయ గుర్తింపు లభించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితి అనుబంధంగా వున్న ప్రపంచ పర్యాటక సంస్థ భూదాన్ పోచంపల్లిని ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా ఎంపిక చేయడం అభినందనీయమని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ సాంస్క`తిక పునరుజ్జీవనం దిశగా స్వయం పాలనలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ ఫలితంగా తెలంగాణ చారిత్రక పర్యాటక ప్రాంతాలు అంతర్జాతీయ గుర్తింపును సాధిస్తున్నాయని సీఎం తెలిపారు.