రేపు KCR ఢిల్లీ టూర్పై రాని స్పష్టత
ABN , First Publish Date - 2022-06-14T16:03:41+05:30 IST
సీఎం కేసీఆర్కు బదులు పార్టీ సీనియర్ నేత కేకేను ఢిల్లీకి పంపే అవకాశం ఉంది. రేపటి మమత బెనర్జీ మీటింగ్కు కేసీఆర్ గైర్హాజరు కానున్నారు.
హైదరాబాద్ : సీఎం కేసీఆర్(CM KCR)కు బదులు పార్టీ సీనియర్ నేత కేకేను ఢిల్లీ(Delhi)కి పంపే అవకాశం ఉంది. రేపటి మమత బెనర్జీ మీటింగ్కు కేసీఆర్ గైర్హాజరు కానున్నారు. 19న పార్టీ కార్యవర్గ సమావేశం నేపథ్యంలో చర్చించే అంశాలపై సీఎం బిజీ బిజీగా ఉన్నారు. అదే రోజు పార్టీ ప్రకటన ఉండే అవకాశం ఉంటుందని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారం హస్తినకు కేసీఆర్ వెళ్లనున్నారు. వారం రోజుల పాటు ఢిల్లీలో పలవురు ప్రముఖులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. పార్టీ జెండా, ఎజెండా, సాంకేతిక అంశాలపై నిపుణులతో కేసీఆర్ చర్చించనున్నారు. నిన్నటి ఉండవల్లి మీడియా సమావేశంతో పార్టీ ఏర్పాటుపై క్లారిటీ వచ్చినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు.