‘రైతులు ఏ పంట వేసుకోవాలో సీఎం స్పష్టత ఇవ్వాలి’

ABN , First Publish Date - 2021-12-19T22:42:57+05:30 IST

ఇది బెంగాల్ కాదు.. తెలంగాణ అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ కమిట్‌మెంట్‌తో పనిచేసే పార్టీ అని చెప్పారు.

‘రైతులు ఏ పంట వేసుకోవాలో సీఎం స్పష్టత ఇవ్వాలి’

మెదక్: ఇది బెంగాల్ కాదు.. తెలంగాణ అని  ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ కమిట్‌మెంట్‌తో పనిచేసే పార్టీ అని చెప్పారు. కేసీఆర్ చిల్లర వేషాలు వేస్తే ప్రజలు తిప్పికొడతారని హెచ్చరించారు. ధనిక తెలంగాణలో.. సీఎం వరి మాత్రం వద్దంటున్నారని పేర్కొన్నారు. 40 కిలోల బస్తాలో 4కిలోల తరుగు తీస్తే రైతు ఎలా బతుకుతాడు? అని ఆయన ప్రశ్నించారు. 60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొంటామని కేంద్రం చెప్పిందన్నారు. ప్రశ్నించినవారిని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఈటల మండిపడ్డారు. రైతులు ఏ పంట వేసుకోవాలో సీఎం స్పష్టత ఇవ్వాలన్నారు. 

Updated Date - 2021-12-19T22:42:57+05:30 IST