పల్లె, పట్టణప్రగతిపై CM KCR ఉన్నతస్థాయి సమావేశం
ABN , First Publish Date - 2022-05-18T17:54:21+05:30 IST
CM KCR పల్లె, పట్టణప్రగతిపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జడ్పీ చైర్మన్లు, మేయర్లు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు
హైదరాబాద్: CM KCR పల్లె, పట్టణప్రగతిపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జడ్పీ చైర్మన్లు, మేయర్లు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు సమీక్ష సమావేశంలో కేసీఆర్ ధాన్యం సేకరణపై, వైకుంఠధామాలు, మార్కెట్ల నిర్మాణం, ప్రకృతి వనాలు అభివృద్ధిపై, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణపై చర్చించారు.
ఈ మే 20 నుంచి జూన్ 5 వరకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు. పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధి కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీల్లో అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికలపై కేసీఆర్ ఆరా తీశారు. గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో నిధుల సమీకరణ గురించి తెలుసుకున్నారు. మున్సిపాలిటీల్లో దోబీ ఘాట్లు, మార్కెట్ల నిర్మాణాల వివరాలు, పట్టణ ప్రగతిలో మార్పులపై కేసీఆర్ సూచనలు చేయనున్నారు.