బడ్జెట్పై సీఎం కేసీఆర్ సమీక్ష ప్రారంభం
ABN , First Publish Date - 2021-03-06T17:40:42+05:30 IST
బడ్జెట్పై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం ప్రారంభమైంది. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సమీక్షలో పాల్గొన్నారు.
హైదరాబాద్: బడ్జెట్పై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం శనివారం ప్రగతి భవన్లో ప్రారంభమైంది. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సమీక్షలో పాల్గొన్నారు. మంత్రితో పాటు సీఎస్ , ఫైనాన్స్ శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు ఆయా శాఖల అధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సమీక్షలో బడ్జెట్ సమావేశాల తేదీలను కూడా సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.