పేద ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం
ABN , First Publish Date - 2022-09-25T04:00:49+05:30 IST
పేద ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. శనివారం భవిత డిగ్రీ కళాశాలలో మహి ళలకు బతుకమ్మ చీరలు, ఆసరా పింఛన్కార్డులను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆద ర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు.
బెల్లంపల్లి, సెప్టెంబరు 24: పేద ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. శనివారం భవిత డిగ్రీ కళాశాలలో మహి ళలకు బతుకమ్మ చీరలు, ఆసరా పింఛన్కార్డులను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆద ర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. మున్సిపల్ చైర్ప ర్సన్ శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ తహసీల్దార్ కుమారస్వామి పాల్గొన్నారు.
తాండూర్: తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు బతుకమ్మ పండగను సంతోషంగా జరుపుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వం చీరలను పంపిణీ చేస్తుందని తెలిపారు. ఎంపీపీ ప్రణయ్కుమార్, జెడ్పీటీసీ బాన య్య, ఎంపీటీసీలు శంకర్, శ్రీదేవి, రజిత, కోఆప్షన్ సభ్యుడు నజిఖాన్ సర్పంచులు పాల్గొన్నారు.
నస్పూర్: మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే దివాకర్రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్మన్ ఈసం పెల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రమేష్, సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్ రాజేంద్రపాణి, కౌన్సిలర్లు, సుబ్బయ్య, పాల్గొన్నారు.
హాజీపూర్: మండల కేంద్రంతో పాటు వేంపల్లి, ము ల్కల, గుడిపేట, నంనూర్, నర్సింగాపూర్, రాపెల్లి, కర్ణ మామిడి, పడ్తన్పల్లి, టీకనపల్లి, బుద్దిపెల్లి, దొనబండ గ్రామాల్లో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఎంపీపీ స్వర్ణలతశ్రీనివాస్, జెడ్పీటీసీ శిల్పశ్రీనివాసరావు, పాల్గొన్నారు.
జన్నారం: ఎంపీడీవో కార్యాలయంలో మహిళలకు బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే రేఖానాయక్ పంపిణీ చేశారు. అలాగే లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీము బారక్ చెక్కులను పంపిణీ చేశారు. డీఆర్డీవో శేషాద్రి, మండల అధ్యక్షుడు రాజారాంరెడ్డి, తహసీల్దార్ కిషన్, మార్కెట్ కమిటీ చైర్మన్ పద్మబుచ్చయ్య, కో ఆప్షన్ మున్వర్ ఆలీ, సర్పంచు, వైస్ఎంపీపీ పాల్గొన్నారు.
నెన్నెల: బతుకమ్మ పండుగను సంబరంగా జరుపు కోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వం చీరెలు పంపిణీ చేస్తోం దని ఎంపీపీ సంతోషం రమాప్రతాప్రెడ్డి అన్నారు. జడ్పీటీసీ శ్యామలారాంచందర్, తహసీల్దార్ భూమేశ్వ ర్, కోఆప్షన్ ఇబ్రహీం, ఎంపీటీసీ తిరుపతి, అశోక్గౌడ్, శ్రీనివాస్గౌడ్, సర్పంచ్ గొర్లపల్లి బాపు పాల్గొన్నారు.
భీమారం: బూరుగుపల్లిలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. సర్పంచు రమాదేవి, జడ్పీటీసీ భుక్య తిరుమల, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజ్కుమార్ , టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజ్కుమార్, లక్ష్మణ్, తిరుపతి, రాజేష్నాయక్, పాల్గొన్నారు.