నేడు ముంబైకి వెళ్లనున్న సీఎం KCR

ABN , First Publish Date - 2022-02-20T14:11:34+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ముంబై వెళ్లనున్నారు. ఉద‌యం 11 గంట‌ల‌కు హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక విమానంలో ముంబాయికి బయలుదేరి వెళ్లనున్నారు.

నేడు ముంబైకి వెళ్లనున్న సీఎం KCR

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ముంబై వెళ్లనున్నారు. ఉద‌యం 11 గంట‌ల‌కు హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక విమానంలో ముంబాయికి బయలుదేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట‌కు మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ థాక్రేతో సీఎం కేసీఆర్ స‌మావేశం అవుతారు. కేసీఆర్‌తో పాటు ఆయ‌న వెంటే వెళ్లే బృందానికి ఉద్ద‌వ్ థాక్రే భోజ‌నానికి ఆహ్వానించిన విష‌యం తెల్సిందే. భోజ‌నం, చ‌ర్చ‌ల అనంత‌ర ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ నివాసానికి తెలంగాణ సీఎం వెళ్ల‌నున్నారు. జాతీయ రాజ‌కీయ అంశాల‌పై ఈ సంద‌ర్భంగా చ‌ర్చించ‌నున్నారు. ఆదివారం సాయంత్రానికి సీఎం కేసీఆర్ హైద‌రాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. 

Updated Date - 2022-02-20T14:11:34+05:30 IST