నార్కట్ పల్లికి చేరుకున్న సీఎం కేసీఆర్
ABN , First Publish Date - 2022-04-28T19:41:17+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపటి క్రితమే నార్కట్పల్లికి చేరుకున్నారు.
నల్గొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపటి క్రితమే నార్కట్పల్లికి చేరుకున్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నర్సింహ్మ సంతాప సభకు హాజరైన సీఎం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆపై ఎమ్మెల్యే లింగయ్యను పరామర్శించారు. లింగయ్య తండ్రికి మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు నివాళులర్పించారు.