జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పై సీఎం కేసీఆర్ ప్ర‌శంస‌ల జల్లు

ABN , First Publish Date - 2021-10-25T21:02:47+05:30 IST

టీఆర్ఎస్ ప్లీన‌రీ వేదిక‌గా మాజీ మంత్రి, జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే ల‌క్ష్మారెడ్డిపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పై సీఎం కేసీఆర్ ప్ర‌శంస‌ల జల్లు

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్లీన‌రీ వేదిక‌గా మాజీ మంత్రి, జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే ల‌క్ష్మారెడ్డిపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ద‌ళిత బంధు కేవ‌లం రూ.10 ల‌క్ష‌లిచ్చి మ‌మ అనే కార్య‌క్ర‌మం కాదు అని సీఎం అన్నారు. ద‌ళితుల బాగు గురించి అనేక ప్ర‌య‌త్నాలు జ‌రిగాయని, మాజీ మంత్రి జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే ల‌క్ష్మారెడ్డి స‌ర్పంచ్‌గా ప‌ని చేసిన కాలంలో ఆయన సొంత గ్రామంలో 10 ఎక‌రాల భూమి(ఇప్పుడు రూ. 50 ల‌క్ష‌ల విలువ) ఆరుగురు ద‌ళితుల‌కు పంచి పెట్టారని సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డిని కొనియాడారు.

Updated Date - 2021-10-25T21:02:47+05:30 IST