ఫామ్హౌస్ నుంచి ప్రగతిభవన్కు CM KCR
ABN , First Publish Date - 2022-05-16T20:09:00+05:30 IST
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (CM KCR) ప్రగతిభవన్కు (Pragathi Bhavan) చేరుకున్నారు.
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (CM KCR) ప్రగతిభవన్కు (Pragathi Bhavan) చేరుకున్నారు. గత నెల 29 నుంచి ఎర్రవెల్లి ఫామ్హౌస్లోనే ఉన్న కేసీఆర్ ఇవాళ ప్రగతిభవన్కు వచ్చారు. ఇన్ని రోజులూ అందుబాటులో ఉన్న మంత్రులతో (Ministers) ఫామ్హౌస్లోనే పలుమార్లు సీఎం (CM) సమావేశమయ్యారు. అయితే.. ఇవాళ ప్రగతిభవన్కు రాగానే పార్టీ ముఖ్యనేతలు, అధికారులతో సమావేశాలు నిర్వహించారు. రాజ్యసభ అభ్యర్థులను సీఎం.. రేపు ఖరారు చేయనున్నారు. అనంతరం ఎల్లుండి మంత్రులు, కలెక్టర్లతో కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పట్టణ ప్రగతి, పల్లెప్రగతిపై సమీక్ష చేయనున్నారు.
మొత్తానికి చూస్తే.. ఇవాళ్టి నుంచి కేసీఆర్ వరుస సమావేశాలు, సమీక్షలతో బిజిబిజీగా గడపనున్నారు. ఇవన్నీ అటుంచితే.. ఈ మధ్య తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ వరుస సభలు పెట్టి కేసీఆర్ సర్కార్పై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే త్వరలోనే అందుకు కౌంటర్గా కేసీఆర్ ప్రత్యేకంగా మీడియా మీట్ నిర్వహిస్తారని తెలియవచ్చింది.