కరోనాపై మరోసారి సమీక్ష చేయనున్న సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2021-05-10T19:02:56+05:30 IST

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనాపై మరోసారి సమీక్ష జరపనున్నారు.

కరోనాపై మరోసారి సమీక్ష చేయనున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనాపై మరోసారి సమీక్ష జరపనున్నారు. ఇప్పటికే మంత్రి హరీష్‌రావు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రగతి భవన్‌లో జరగనున్న ఈ సమావేశానికి చేరుకున్నారు. నిన్న దాదాపు అర్ధరాత్రి వరకు సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి... సోమవారం మరోసారి కరోనా పరిస్థితులపై అధికారుల నుంచి వివరాలు సేకరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ పంపిణీతోపాటు పరీక్షల సంఖ్య పెంచడం, అలాగే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్ల కొరతపై సమీక్ష చేయనున్నారు. కాగా ఆక్సిజన్ల సమస్యతోపాటు రెమిడెసివియర్ ఇంజక్షన్ల సరఫరాపై నిన్ననే ప్రధాని మోదీ దృష్టికి సీఎం కేసీఆర్ తీసుకువెళ్లారు. అలాగే తెలంగాణలో చేపట్టనున్న అనేక కార్యక్రమాల వివరాలను ప్రధానికి వివరించారు.

Updated Date - 2021-05-10T19:02:56+05:30 IST